రాజధాని అమరావతి పనుల ప్రారంభంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హైస్పీడ్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని తెలిపారు. ఎన్జీవో, ఆలిండియా సర్వీసెస్ భవనాలు 9 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో విలువైన సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే ప్రారంభమైందని అన్నారు. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా తానే వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఓకే పార్టీ పాలిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89626