సింగరేణి యాజమాన్యం స్పందించి రామగుండం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని కోసం రైతుల నుండి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పాముల పేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుండి సింగరేణి సంస్థ ఓసిపి 4 ఏర్పాటు కొరకై భూములను సేకరించిన యాజమాన్యం బొగ్గు నిల్వలు పూర్తి అయి గనిని మూసివేసినప్పటికి భూములు తిరిగి ఇవ్వడం లేదని, పైగా కంచెను ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కంచెను ట్రాక్టర్ సహాయంతో స్వయంగా ఎమ్మెల్యే తొలిగించారు. విలేజి రామగుండం, పాములపేట, లింగాపూర్, మేడిపల్లి భూనిర్వాసిత రైతులకు ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని, వెంటనే ఫెన్సింగ్ వేసే పనిని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
Coal
సింగరేణి 135 వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి హై స్కూల్ మైదానం లో ఆవిర్భావ దినోత్సవo ఘనంగా నిర్వహించారు. గౌరవ వందనం అనంతరం సింగరేణి సంస్థ జెండాను ఆవిష్కరణ చేసిన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ A. మనోహర్..
సింగరేణి అధికారులు, కార్మికులు, సింగరేణి మహిళా సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ స్టాల్స్, తినుబండారు స్టాల్ లను మందమర్రి ఏరియా జిఎం A. మనోహర్, మహిళా సేవా సమితి అధ్యక్షురాలు సవిత మనోహర్ లు ప్రారంభించారు. సింగరేణి వర్క్ షాప్ కార్మికులు ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ సబ్ స్టేషన్ ను హెల్త్ డిపార్ట్మెంట్, సింగరేణి రెస్కు్ టీం, వివిధ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పరికరాలు జిఎం సందర్శించి, పనితీరు ఎలా వుంది అని సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జియం మాట్లాడుతూ.. సింగరేణి సిరుల తల్లి నల్ల బంగారం పుట్టినరోజు నేడు, 135 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు కార్మికులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. 135 సంవత్సరాల నుండి దక్షణ భారత దేశానికీ కొంగు బంగారం, తెలంగాణ రాష్ట్రానికి తల మణికం, ఆరు జిల్లా లలో విస్తరించి ఉన్న సింగరేణి తల్లి కొంగు బంగారం, ఈ ప్రాంతంలో లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థ రక్షణతో కూడిన నిత్యం శ్రమించే కార్మికులు బొగ్గు ఉత్పత్తి సాధించుడయే సింగరేణి లక్ష్యమని అన్నారు. సింగరేణి సంస్థ యాజమాన్యం బొగ్గుగనుల్లో అత్యాధునికమైన పరికరాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లొ అధికారులు, కార్మికులు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.






Total views : 78042