లోక్ సభ ఎన్నికల(Lok Sabha election) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఈసీని కలిశారు. ఈ క్రమంలో, రూల్ 54A ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్ను కొట్టిపారేస్తున్నాయి. ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ సీట్లలో కూటమి ఎక్కువగా గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మాత్రం వైసీపీ ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు.
- నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…
- కేరళంలోని వయనాడ్లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 75406