బిగ్ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్లో ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొన్న నారాయణ బిగ్ బాస్ అనేది నేరపూరిత సామాజానికి దోహదపడుతుందన్నారు. అది దేశానికి, యువతకు చీడపురుగన్నారు. ఈ సమాజాన్ని బిగ్ బాస్ షో ధ్వంసం చేస్తుందన్నారు. బిగ్ బాస్ను అడ్డుకోవాల్సిన కర్తవ్యం కళకారులు అందరిపైనా ఉందని చెప్పారు. అశ్లీలమైన ప్రదర్శన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులు అందరూ కలిసి వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్ని ధ్వంసం చేయాలని, దాడులు సైతం చేయాలని పిలుపునిచ్చారు.
CPI Narayana
నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చెందారు. తెలంగాణలో సమిష్టి కృషితోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. కేవలం సీపీఐ వల్లే గెలిచిందని తాను ఎక్కడా చెప్పలేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మిగతా రాష్ట్రాల్లోనూ తమతో పొత్తు పెట్టుకున్న వారే గెలుస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో తమ పార్టీ ప్రభావం ఉందని అందుకే కాంగ్రెస్ ఈజీగా గట్టెక్కిందని సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. దీంతో నారాయణ స్పందించి ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
ఏపీ రాజకియాలపై సీపీఐ నారాయణ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజగా చోటు చేసుకుంటున్న రాజకీయాలపై, వచ్చే ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఏపీకి పాలిటిక్సు లింక్ చేస్తూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారయి. ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలే కాబోతున్నాయని, జగన్మోహనన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పొరు. ఎమ్మెల్యేలకు అవినీతికి పాల్పడమని చెప్పిందే జగనే అని ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ప్రయోజనం లేదు నారయణ ప్రశ్నించారు. వైసీపీలో ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు సీఎం అభ్యర్థినే మార్చాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.




Total views : 78416