ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి. కానీ నిన్న చనిపోయిన సీతారాం ఏచూరి నమ్మకాన్ని ఒక నిలువెత్తు నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు.
విప్లవమా! అది వస్తుందో రాదో తెలియని దశలో సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో ఏచూరి కామ్రేడ్ గా మారారు పైన స్వర్గం ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి “పొద్దు తిరుగుడు పూలు” కూడా సిగ్గుపడి తల దించుకున్నాయి.
కళ్ళ ముందే బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా, చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు పక్క చూపులు చూడలేదు.
చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం. కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు. ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు. అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల. ఆది దాదాపు అసాధ్యమయిన పని. అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీ లో ఒక ప్రొఫెస్సర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు.
కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త (ideologue), ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీ లో క్రీమీ లేయర్ గా, ఒక ఎలీట్ గా మిగిలిపోయారు. అందువల్ల తన టిపికల్ ఫార్మ్, ఆంగ్లిసైజెడ్ కంటెంట్ లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది.
జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు. అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా, వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది. అలాగే 20 వ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు. బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు.
మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి పెద్ద సవాల్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి