ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.68 మీటర్ల చేరుకున్న నీటిమట్టం. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం.15372 క్యూసెక్కుల చేరుతున్న నీరు.ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టి.ఎం.సి.లు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 1400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.
cyclone news
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు. ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని కథలు చెప్పాడు. ప్రజలు తమ భాదను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారికి తెలియజేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా తుఫాను బాధితులకు ఇవ్వలేదు.
ఇదేనా ప్రభుత్వం నిబద్దత అని ఎద్దేవా చేసారు.
గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్. తుఫాన్ కారణంగా హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు,తిరుపతి,విశాఖపట్నం, షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు. విజయవాడకు మీదుగా వెళ్లే 145 రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. మూడు రోజులపాటు రైళ్ళను రద్దు చేసిన అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4.12.2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులను తూ.చా తప్పకుండా పాటించవలసిందిగా ఆ ప్రకటనలో ఆదేశించడం అయినది.
నెల్లూరుకు 250 కి.మీ, దూరంలో కేంద్రీకృతమై ఉన్న మీచౌంగ్ తుఫాన్…గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్. తీవ్రవాయుగుండం కారణంగా శనివారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా నమోదు కురుస్తున్న భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 80 -100 కీమీ వేగంతో గాలులు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక…. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న నెల్లూరు జిల్లా యంత్రాంగం. ఇప్పటికే నెల్లూరు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు. మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కోవూరు నియోజవర్గంలో పలు మండలాల్లో ఈదురుగాలితో కూడిన బారి వర్షం. కురుస్తున్న వర్షం దాటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పలు మండలాల్లో కరెంట్ అంతరాయం.





Total views : 79496