మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సారవకొట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వరాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Darmana krishna das
అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే.. చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము.. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను ఇచ్చిన మన శ్రీకాకుళం కు ఓక్క సంస్థను కూడా బాబు ఇవ్వలేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వికేంద్రీకరణకి అడుగులు వేసాం.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే విశాఖపట్నం కి రాజధాని రావాలి.. రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటే అక్కడ కర్నూల్ ఓక రాజధానిగా ఉండాలి.. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండాలి. మహిళలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ పెద్ద ఎత్తున ఇళ్లపట్టాలని అందజేశాం.. తెలుగుదేశం , జనసేన కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు.. ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీరు దాన్ని గమనించండి జగన్ కి ఓటేయండి..
Read Also..
దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు. జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం. బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసాం. పాదయాత్ర గుర్తించిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. విద్యా, వైద్యం కు ప్రదమ ప్రాధాన్యత నిచ్చారు.. దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ను నెలకొల్పుతున్నారు.. ఆర్బీకే లతో రైతులకు అన్ని విశాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం తో అనేక ప్రాజెక్ట్ లు వెనక బడ్డాయి. టెక్కలి లో మూడు వేల కోట్లతో పోర్టు నిర్మాణం సాగుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపుతున్నాం. కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 4 ఏళ్లలో అనేక విప్లవాత్మక మార్పులు చెపట్టాం. వచ్చేది వైఏస్ జగన్ ప్రభుత్వమే. సర్వేలన్నీ మరలా జగన్ నే నెక్స్ట్ సిఏం అని చెపుతున్నాయి..






Total views : 78208