గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివ్వెల మాధురికి గాయాలుకాగా.. పలాస ఆస్పత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదంలో దివ్వెల మాధురి పేరు గత రెండు మూడు రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద మాధురి ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో మాధురి స్వయంగా కారును నడుపుతున్నట్లు తెలిసింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని.. తనతో పాటుగా, తన పిల్లలపైనా ట్రోలింగ్ జరుగుతోందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని.. అందుకే చనిపోవాలనుకున్నట్లు ఆస్పత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించొద్దని కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి