రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలలో భాగంగా పేద ప్రజలు కేటాయించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో 3,4 లేఅవుట్ నందు సుజల స్రవంతి పథకం కింద సుమారు 11 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, ఇంటింటికీ కుళాయిలు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కాలనీలకు కరెంట్ కొరత లేకుండా33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజల స్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో త్రాగునీరు విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రత్యేకమైన రూపకల్పనతో క్రమబద్ధీకరమైన పనులను చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమాం సర్పంచ్ రాందేవ్ చిన్న, తదితరులు పాల్గొన్నారు.
Tag:
Electricity sub station
విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని కనకదుర్గ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. ” విద్యుత్ శాఖ ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గం లో 42 కోట్లు ఖర్చు పెట్టింది. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంలో మన ముఖ్యమంత్రి పాత్ర మరువలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం లో దేవినేని అవినాష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also..





Total views : 79927