కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు. ఆ ట్యాబ్ ల వల్ల అసభ్యకర వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే లు కుడా అసభ్యకర వీడియోలు చూస్తున్నరన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికి ట్యాబులు, లాప్టాప్ లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పోటీపడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.
Errakota Chennakesava Reddy
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220/132/33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని, ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని,ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా,దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు.





Total views : 147675