కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు. ఆ ట్యాబ్ ల వల్ల అసభ్యకర వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే లు కుడా అసభ్యకర వీడియోలు చూస్తున్నరన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికి ట్యాబులు, లాప్టాప్ లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పోటీపడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.
ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు..
373
previous post





Total views : 91209