దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య. గడ్డి మందు తాగి రైతు కిశోర్బాబు(48) ఆత్మహత్య. తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్. అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్బాబు ఆత్మహత్యాయత్నం. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
Tag:
Farmer Suicide
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో సంకురాత్రి వెంకట కోటయ్య తండ్రి జానయ్య (42) అను రైతు గత నాలుగైదు సంవత్సరాలుగా, కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా లేక ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ అయ్యి, రెండవ సంవత్సరం నీళ్లు సరిగా లేక పంటలు సరిగా పండక మనస్తాపంతో పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు, ఈ సంవత్సరం ఏడు ఎకరాల పొలమును కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పంట నష్టం కారణంగా అదే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.





Total views : 80399