పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పీవోకేని భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని అబ్దుల్లా అన్నారు. భారత్లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్నాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూక్ అబ్దుల్లా ఈ కౌంటర్ ఇచ్చారు. కాగా కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్లో భాగం కావాలనుకుంటున్నారని, పీఓకేను బలవంతంగా భారత్లో కలపాల్సిన అవసరం లేదని అన్నారు.
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
- రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
- సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్పై సైబర్ దాడి..సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో సైబర్ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్ పేమెంట్ సిస్టమ్పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90571