విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్. వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు. అనంతరం సిగరెట్ కాల్చి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటులో వేశారని అన్నారు. మంటలు బాగా వ్యాపించడంతో ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. ఈ ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 437,438,285 కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు అనుమనితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సిపి తెలిపారు. విచారణలో భాగంగానే యూట్యాబర్ నానిని తీసుకొచ్చామన్నారు. విచారణలో అతని ప్రమేయం లేదంటే తాము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్ళమన్నారు. ఈ కేసుకు సంభందించి 50 కు ఫైగా సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు. నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకుందని ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మోనటరింగ్ చేస్తామని సీపీ రవి శంకర్ తెలిపారు
Fishing Harbour
విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది. రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి ఉప్పు చేప కాదు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది. ప్రధాన నిందితులు వాసుపల్లి నాని, అతని మామ వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. ఈనెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్లో పార్టీ చేసుకున్నారు. మందులో నంజుకోవడానికి ఉప్పుచేపను వేయించారు. ఆ చేపను తిన్న తర్వాత మద్యం మత్తులో కాల్చిన సిగరెట్ ముక్క పక్క బోటులోకి విసిరేశారు. సిగరెట్ ముక్క బోటు ఇంజిన్ పై పడింది. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. మద్యం మత్తులో చేసిన ఈ చిన్న తప్పిదం గంగపుత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కళ్లెదుటే తమ జీవనాధారం బూడిదవ్వటంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం వేగంగా స్పందించి 49 మంది బాధితులకు ఏడు కోట్ల పదకొండు లక్షల నష్టపరిహారాన్నిఅందించి ఆదుకుంది.
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also..
Read Also..





Total views : 80701