ఏలూరు జిల్లా(Eluru District) పెదవేగి మండలం గోపన్నపాలెం(Gopannapalem)లో వైసీపీ(YCP), కాంగ్రెస్ నేతల(Congress leaders) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు గాయాలు తగిలాయి. ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రచార వాహనంపై వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ధ్వంసం అయింది. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గంగన్నగూడెం రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. కనీసం మహిళలని చూడకుండా వైసీపీ నేతలు తమపై దాడికి పాల్పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.