రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మంత్రులను తొలగించే అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది. తమిళనాడు మంత్రి వి.సెంథిల్ తొలగింపు కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్ 13న అరెస్టు చేశారు. దీంతో, మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కనపెట్టింది. మంత్రి అరెస్టయ్యాక కూడా మంత్రివర్గంలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ ఎం.ఎల్, రవి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో, సదరు న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. రవి వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది. ప్రాథమికంగా చూస్తే హైకోర్టు తీరు సరైందే. ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతట తానుగా బర్తరఫ్ చేయలేరు. రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది.
Governer
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదని ప్రభుత్వ విప్ గా ఎన్నికై సిరిసిల్లకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్పుగా ఎన్నికై సిరిసిల్ల పర్యటనకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు పట్టణంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందన ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో పెద్ద పూలమాలతో ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని పలు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని, ఇచ్చిన హామీలలో భాగంగా ఇప్పటికే సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని, ప్రతిపక్షంలో కూర్చున్న టిఆర్ఎస్ పార్టీకి ఇంకా అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారని అభివృద్ధికి నోచుకోని పథకాలను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని అమలు చేసే దిశగా కృషి చేస్తుందని, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం పైన రాజకీయాలు చేస్తున్నారని, ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Read Also..
త్రిపురలో గవర్నర్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా.. తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా.. త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అక్కడి ప్రజలు ఆశీస్సులు.. టిటిడి ఛైర్మన్, ఈవోని కలిసి త్రిపుర ప్రజల భావాలను తెలియజేశాను.. త్వరలోనే త్రిపురలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించేందుకు టిటిడి ఛైర్మన్, ఈవో సానుకూలంగా స్పందించారు..
Read Also..




Total views : 78946