తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. ఈ అవార్డును ఆదివారం మోదీకి అందజేసింది. నైజీరియన్లు కాకుండా.. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మోదీనే కావడం విశేషం. ఈ అవార్డును తనకు అందజేసిన నైజీరియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తినూబూ ఆహ్వానం మేరకు ఆదివారం నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.
నైజీరియా ప్రధానమంత్రి నెసోమ్ ఎజెన్వో ఎయిర్పోర్టుకు చేరుకుని మోదీని అబుజా నగరంలోకి ఆహ్వానిస్తున్నట్లు సంకేతంగా ఓ తాళాన్ని అందజేశారు. ఓ వ్యక్తిపై నమ్మకం, గౌరవానికి సూచికగా నైజీరియన్లు ఆ తాళాన్ని అందజేస్తారని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఎక్స్లో పేర్కొంది. అనంతరం ఆ దేశాధ్యక్ష భవనానికి చేరుకున్న మోదీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబూతో సమావేశమై ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నైజీరియా పర్యటన అనంతరం జీ- 20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. అటు నుంచి గయానా వెళ్లి భారత్కు తిరిగి రానున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90053