అచ్చంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ పై జరిగిన దాడి ని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి పిరికి చర్య అని మండిపడ్డారు. ప్రచారం నిర్వహించి తిరిగి వెళుతున్న క్రమంలో ఇలాంటి ఆటవిక చెరగకు పాల్పడడం కాంగ్రెస్ నేతలకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతో ఇలాంటి పిరికి చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న ఆధార అభిమానులను చూసి ఓర్వలేకపోతున్నారని, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇన్నాళ్లు మాకు కలిగిందని ఇకపై కూడా ప్రజలు మమ్ములను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని మా పార్టీ సేవలే మాకు శ్రీరామరక్షగా ఉంటాయని అన్నారు. దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరించారు.
Tag:





Total views : 91124