శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాల తోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.
Health
కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవాలి.
సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. అది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మేకప్ రిమూవర్గానూ ఉపయోగించుకోవచ్చు. రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్గా పనిచేస్తుంది. కాలిన గాయాలూ, ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి. కనురెప్పలకి రాసే మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి.
రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు(కార్బొనేటడ్ డ్రింక్స్) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్లోని కింగ్స్ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్ష సారాయి(వైన్), బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు. ”మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం. యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ, వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి” అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్ బాట్లెట్ తెలిపారు. తీసుకునే ఆహారానికి, దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు. అయితే, కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా.. వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్ రీసెర్చి కౌన్సిల్కు చెందిన డా.గ్లెనిస్ జోన్స్ తెలిపారు. యాపిల్తోపాటు పాలు, జున్ను తీసుకోవడం, ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు.
ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం.గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు.వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి తాగడంవల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు.
కొంతమందికి తినడానికి సమయం ఉండదు. హడావిడిగా ఏదోఒకటి తినేస్తుంటారు. ఈరోజుల్లో బయట తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దాదాపుగా అందరూ నిలబడి తింటున్నారు. పెళ్లిళ్లైనా, ఫంక్షన్స్ అయినా.. ఎక్కడైనా అందరూ నిలబడే తింటున్నారు. ఒకటి రెండుసార్లైతే పర్వాలేదుకానీ ప్రతిసారి.. అదేపనిగా నిలబడి తినడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువ తీసుకుంటారు.నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి. తిన్నది జీర్ణం కాదు.గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీని అల్సర్లు వస్తాయి.ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అంతేకాదు.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది
మెనోఫోబియా అంటే పీరియడ్ ఫోబియా. అమ్మాయిలలో, మహిళలలో నెలసరి పట్ల భయం, ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు. మెనో అంటే రుతుక్రమం, ఫోబియా అంటే భయం. దీనిలో పీరియడ్స్ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి, బాధ, ఆందోళన, ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి. మెనోఫోబియా కారణాలు ఒక్కో వ్యక్తికీ.. ఒక్కోలా ఉంటాయి. కొంతమంది మహిళలకు నొప్పితో కూడిన బాధాకరమైన పీరియడ్స్ ఉండొచ్చు. రుతుక్రమానికి సంబంధించిన సాంస్కృతిక నిషేధాలు ఉండొచ్చు. ఇవన్నీ కలిపి పీరియడ్స్ అంటే భయం, ఆందోళనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.ఇది కాకుండా, సామాజిక కళంకం, విద్య లేకపోవడం, రుతుస్రావం గురించి అపోహలు కూడా వీటికి కారణం కావచ్చు.
ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి, అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో ఒక యాలుక్కాయ, దంచిన మిరియాలు రెండు, సోంపు గింజలు అర టీ స్పూన్ వేసి 5 నుంచి 8 నిముషాల సమయం మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచి ఆ తర్వాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. నిమ్మరసం, తేనె కలిపి దీన్ని తీసుకోవడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నవారు దీన్ని తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టుకూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
టైపింగ్, పనులు చేయడం. స్వైపింగ్,, రాత ఇవన్నీ చేతులు వేళ్ళు మణికట్టు మీద దీర్ఘ కాలంలో సమస్యలు తీసుకొస్తాయి. కేవలం ఒకే తరహాగా మూవ్మెంట్స్ ఇవ్వడం వలన సమస్యలు వస్తాయి. అందుకే చేతులు వేళ్ళు. రిస్ట్ కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కేవలం 3 నిముషాలు ఖాళీ సమయంలో చేస్తే చాలు. 1) బొటనవేలు మణికట్టు మధ్య ఈ ప్రదేశంలో ఇలా మరో చేతి సహాయం తో ప్రెషర్ పెడుతూ ఇలా 10 కౌంట్స్ వత్తాలి. ఫార్వార్డ్ అలాగే బ్యాక్ వర్డ్ మోషన్స్ ఇలా చేయాలి. 2) అరచేతి కార్నర్ లో ఉండే చిన్న బోన్ ఇది ఇక్కడ మొదలు పెట్టి చివరిదాకా … మరో చేతి బొటనవేలు ఇతర ఫింగర్స్ సహాయం తో నిదానంగా ప్రెస్ చేయాలి, చేతిని ఇలా కదపాలి. 3) ఇలాగె పై వైపు కూడా వత్తుతూ ప్రెషర్ ఇవ్వాలి. వేళ్ళ కు ఇచ్చే వ్యాయామం చూడండి.వేళ్ళ గీతల మధ్య భాగం లో నెమ్మదిగా గుంజాలి. ఇలా చేస్తే బోన్స్ మధ్య ఇరుక్కున్న గాలి వచ్చేస్తుంది అలాగే ఫ్రోజెన్ ఐన బోన్స్ ఫ్రీ అప్ అవుతాయి కూడా. ఏది చేసినా నిదానంగా రిలాక్స్డ్ గా చేయాలి. అదే పని గా ఎక్కువ వద్దు.
Read Also…
కొందరు బేబీస్ పుట్టడమే ఒకటి లేదా రెండు పళ్లతో పుట్టవచ్చు. వీటిని నేటల్ టీత్ అంటారు. ఇవి అరుదు. ఇవి బలహీనంగా ఉండి దానంతట అదే ఊడిపోతుంది. 6 నెలల – 12 నెలలకు మొదటి పన్ను వస్తుంది.అత్యధికంగా లోయర్ లేదా కింద పళ్ళు మొదట వస్తాయి. దాదాపు 3 ఏళ్లకు 20 పాల పళ్ళు వచ్చేసి ఉండాలి. 13 నెలలు నిండినా పళ్ళు రాలేదంటే వైద్య సహాయం తీసుకోవాలి. మొదటి పన్ను వచ్చే క్రమంలో బేబీస్ కి వాంతులు విరేచనాలు లైట్ ఫీవర్ ఉండవచ్చు. ఇవన్నీ టీతింగ్ తో పాటు వచ్చే సాధారణ సమస్యలు.
Read Also..
Read Also..





Total views : 90341