మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితుల ఇళ్ళను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి, బిజిపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులకు భరోసా ఇస్తూ ఇప్పటికే కిషన్ రెడ్డితో సహా బిజెపి నాయకులు పలుమార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పర్యటనలతో ఏం రాదని వారి కష్టాలు తెలియాలంటే వారితో గడపాలని సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన బిజెపి.. బస్తీ నిద్రకు పిలుపునిచ్చింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ బస్తీ నిద్ర సాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇరవై ప్రాంతాలలో బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ బస్తీ నిద్ర చేస్తున్నారు. బిజెపి చేస్తున్న బస్తీ నిద్ర ద్వారా మూసీ పరివాహక ప్రాంత వాసులకు భరోసా కలిగిస్తామంటున్న కేంద్ర మంత్రి, బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సత్తిరాజు ఫేస్ టూ ఫేస్….
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి