తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం”మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యాకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం ఉందని నిలదీస్తూ ఆక్రోసంగా నిషా పై దాడి చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. నిషా తల్లిదండ్రులు, బంధువులు మా కూతురుపై ఎందుకు దాడి చేశావు అని అడగగా, వారి పైన కూడా దాడి చేసినట్లు తెలిపారు. మనస్థాపానికి గురైన నిషా ఆత్మహత్యకు పాల్పడి నగిరి, తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. నిషా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి దర్శిత అనే ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప ఉన్నట్లు సమాచారం. సంబంధిత విషయంపై నాగలాపురం ఎస్ఐ ఓబయ్య వివరణ కోరగా పై విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tag:
illicit relationship
ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని (26), ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు మడుగులో మిగతజీవిగా పడి ఉండటం చూసిన స్థానికులు వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి కి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పావని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు,మృతురాలు పావునికి ఆమె భర్త కాటయ్యకు మధ్య గత కొంతకాలం నుంచి మాస్పర్ధలు ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో భర్త ఆమెను హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త కాటయ్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.






Total views : 78626