రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరు కానుండగా, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతోపాటు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఇతర నేతలు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 50 వేల మందికిపైగా మహిళలే బహిరంగ సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పదేండ్ల పాటు కళాక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేయగా, సీఎం రేవంత్రెడ్డి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే ఛాలెంజింగ్ గా తీసుకుని దానిని ఓపెనింగ్ కు సిద్ధం చేశారు. అంతేగాకుండా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం ఇక్కడే శిలాఫలకం వేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి