నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్డులలో గల పలు రైస్ మిల్లులలో అధికారుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం మీద ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఐదు రైస్ మిల్లులో ఏకకాలంలో దాడులు జరిపారు. ఆయా రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.
IT officers
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారo అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుమారు మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు జిల్లాలో సోదాలు నిర్వహించారు. ఒకరు విశ్రాంత ప్రిన్సిపాల్ కాగా, మరొకరు ప్రముఖ బంగారు వ్యాపారి తో పాటు పత్తి మిల్లు యజమాని ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయింది. ఎన్నికల వేళ ఐటి అధికారుల సోదాలు నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపాయి. ఇండ్లలో సోదాలు జరిపిన ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న వారు కావడం, నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చాలా రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు జరపడం విశేషం. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు సోదాలు జరపడంతో జిల్లా కేంద్రానికి చెందిన మరి కొంతమంది బడా వ్యాపారులు ఉలిక్కిపడ్డారు.




Total views : 78479