పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో జగన్నన్న గోరుముద్ద పథకంలో మరోసారి బయటపడ్డ కుంభకోణం…. విద్యార్థులకు అందించే రాగిపిండి , బెల్లం డేట్ కొట్టేసి ఉన్న వాటిని స్కూల్ అధికారులు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ జగనన్న గోరుముద్ద పిల్లలకు గోరి కడుతుందని, నాణ్యతలేని మరియు గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను వాడి పిల్లలకు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం దాచేపల్లి మండలంలో ఫుడ్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి మరియు బెల్లం ప్యాకెట్లు… ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు…. ఇలా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
jagan mohan reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా. ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారంటున్నారు నూరి ఫాతిమా. వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమాతో మా సివిఆర్ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు పేస్.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపు నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా.. తను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ, వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా.
Read Also..
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరమని ఎగతాళి చేసి మేము అధికారంలోకి వస్తే మోటర్లు పీకేస్తామని ప్రహబ్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనిని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం మా ప్రధాన అంశం. టోల్ ప్లాజా నెంబర్ 1902 కాల్ చేస్తే మీ పరిష్కారం అంటూ నాయకులు తెలుపుతున్నారు. స్పందన కార్యక్రమంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తీరుస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు చెప్పారు.
తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని.. నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ కి ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని, నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఎంపి మార్గాని మాటలను ఖండించారు. తిరుమలలో జగన్ మోహన్ కి భజన చేయడం మంచి పద్దతి కాదని తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా టిటిడి చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు..
ఏపీలో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని… పేదరికంతో వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని… ఎందుకంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలో శుక్రవారం జగనన్న వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 2,75, 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 275.93 కోట్ల రూపాయలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్న నేపద్యంలో సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఐదవ ఏడాది జగనన్న వాహన మిత్ర పథకం ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తున్నామని మంచి కార్యక్రమాలు చేస్తుంటే జనసేన పని పాట లేని కార్యక్రమాలు చేపడుతున్నాయని, పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటుంటే జనసేన కార్యకర్తలకు రోడ్లమీద మీకేం పని అంటున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్