జగిత్యాల మున్సిపాలిటీ(Jagityala Municipality)లో భూకుంభకోణం కేసు(Land Scam Case)లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో నిందితులుగా అమిరుద్దీన్, ముజాకీర్ లతో పాటు మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్ లో 12 గుంటలకు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో ఈ భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో దీర్ఘకాలిక సెలవులలో మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.