ఆటో మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నా నిందితులను జనగామ పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న రెండు బజాజ్ ఆటోలు, రెండు మోటార్ సైకిల్ వాటి విలువ 730000 వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కి చెందిన నలుగురు వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడుతూ 2022, 2023 సంవత్సరంలో బంజారాహిల్స్ మేడిపల్లి చిలకలగూడ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక మరల జల్సాలకు అలవాటు పడి మూడు రోజుల క్రితం నలుగురు బస్సులో జనగామ వచ్చి జనగామ నగరంలో ఇంటి ముందు పార్కు చేసి ఉన్న బజాజ్ ఆటోను, పెంబర్తి గ్రామంలో మరో ఆటోను తీసుకొని వెళ్లి నిర్మానుస్య ప్రాంతంలో పెట్టి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో పెంబర్తి వై జంక్షన్ వద్ద జనగామ పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగా పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ పోలీసులను డిసిపి సీతారాం అభినందించారు.
Janagama District News
జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆరు గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. మిగతా రెండు గ్యారెంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. ఈ రోజు నుంచి మహాలక్ష్మీ పథకం ప్రారంభించామని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి నైతికంగా నేనే గెలిచానని అక్రమంగా సంపాదించిన డబ్బు తోటి, దొంగ ఓట్ల తోటి మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచాడని చెప్పారు. నైతికంగా విజయం మాదే అని చెప్పారు. కమిటీ హాల్ కు 30 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





Total views : 61487