రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విడుదల చేస్తారు. చార్జిషీట్ను కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేసి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు 92400 15247 నంబర్కు కాల్ చేయాలని బీజేపీ నేతలు కోరారు.
ఈరోజు చార్జిషీట్ విడుదల, 2, 3 తేదీల్లో అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేస్తారు. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కనీసం రెండు వేల మంది సభ్యులతో సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి తీసుకు రానున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి