రామగుండం నియోజకవర్గంలో తనను ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విజయవాడ కేంద్రంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా లోని టీడీపీ కి చెందిన రాష్ట్ర నాయకుడు నాగ శ్రావణ్ కిలారు కొత్తగా సోషల్ మీడియా, ఫేస్ బుక్ లు ఏర్పాటు చేసి మార్ఫింగ్ లు చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నిటిని మైంటైన్ చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంశయనం పాటించాలని సూచించారు.
Korukanti Chander
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు అట్టహాసంగా తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ మేరకు గోదావరిఖని లోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివిధ దేవాలయాలలో ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అనుచరులతో స్థానిక సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ మతాలకు సంబంధించిన గురువులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ఆశీర్వదించారు. అనంతరం గులాబీ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ లోని రిటర్నింగ్ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ రావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి వస్తామని అన్నారు. గతంలో రామగుండం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Read Also..
Read Also..






Total views : 90621