నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు, అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్ను ఆవిష్కరించనున్నారు, అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
kurnool district news
శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్.కె.రోజాకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవం దశ హారతులలో మంత్రి ఆర్. కె.రోజా పాల్గొన్నారు.
Read Also…
Read Also…
శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం నిర్వహించారు ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థంబాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు,ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీ లతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ శివ నామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునుతులైయ్యారు ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదిమాతల్లికి వివిధరకాల హరతులిచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడగ అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల క్యూసెక్కులను తరలించవచ్చు అని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని మహోన్నత సంకల్పాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తుండడం ఈ ప్రాంత వాసుల ఆనందానికి వెలకట్టలేనిది అని చెప్పారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలోని చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటలతో దగ్ధమైన ఘటన చేటుచేసుకుంది డస్టర్ కారు దోర్నాల నుండి శ్రీశైలం వస్తుండగా కారులో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు అప్రమైతమై వెంటనే కారు పక్కకు అపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతైంది ప్రయాణికులు చాకచక్యంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది అయితే కారు షార్ట్ సర్క్యూటే వాళ్లే మంటలు వ్యాపించి ప్రమాదానికి కారణమని ప్రయాణికులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు అగ్నికి ఆహుతైన కారు పొరుమామిళ్లకి చెందిన గాలి మురళి మోహన్ దిగా గుర్తించారు





Total views : 89968