మాదిగల ఓట్లే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరంగల్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గంపగుత్తగా మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని ఆ పార్టీ భావిస్తున్నది. రిజర్వుడ్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ.. అందులోభాగంగా మందకృష్ణను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Tag:
Manda Krishna Madiga
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న బీజేపీని గెలిపించాలని అభ్యర్ధించారు. ఇటీవల జరిగిన మాదిగ విశ్వరూప సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటి ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.




Total views : 79323