ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్పై జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి. ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. జాతీయ మెడికల్ కమిషన్కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే, యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
medical
ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంబోత్ రాంబాబు స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో తమ జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల పై పెట్టిన శ్రద్ద విద్య , వైద్యం , ఉపాధి అంశాలపై పెట్టలేదని విమర్శించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ తమకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను కలరాస్తుందని మండిపడ్డారు. తాము ఈ పోటీలో గెలవకపోయిన తమను విస్మరించిన వారిని ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.





Total views : 79449