ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు.మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరై పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరమ్మత్తులకు మరియు ఒకటవ వార్డు నుంచి 31 వ వార్డు వరకు మున్సిపాలిటీ వాటర్ పైపు లేని పట్టణ శివారు ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించే ఈ రెండు అంశాలను కౌన్సిల్ తో కలసి ఆమోదించారు.అనంతరం కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కమిటీ ద్వారా చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మాచర్ల పట్టణం లోనే డెంగ్యూ వ్యాధి అధిక కేసు నమోదు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని సానిటరీ విభాగం వారు దోమలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు అతి త్వరలోనే బుగ్గ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా మంచి నీటిని అందిస్తామన్నారు మాచర్ల పట్టణానికి వెల్దుర్తి మాచర్ల మండలం దుర్గి రెడ్డి చింతల మండలాల నుండి అత్యధిక సంఖ్యలో మహిళలు తమ కుటుంబాల కోసం వస్తూ ఉంటారని వారికి కనీస మరుగుదొడ్లు లేవని వాటి దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరలో పట్టణంలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిలర్లు మొత్తం జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు కౌన్సిలర్లు మదర్ సాహెబ్ రామిరెడ్డి నరసింహారావు సుభాని మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు మున్సిపల్ ఏఈ లు సిబ్బంది పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.