ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు.మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరై పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరమ్మత్తులకు మరియు ఒకటవ వార్డు నుంచి 31 వ వార్డు వరకు మున్సిపాలిటీ వాటర్ పైపు లేని పట్టణ శివారు ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించే ఈ రెండు అంశాలను కౌన్సిల్ తో కలసి ఆమోదించారు.అనంతరం కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కమిటీ ద్వారా చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మాచర్ల పట్టణం లోనే డెంగ్యూ వ్యాధి అధిక కేసు నమోదు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని సానిటరీ విభాగం వారు దోమలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు అతి త్వరలోనే బుగ్గ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా మంచి నీటిని అందిస్తామన్నారు మాచర్ల పట్టణానికి వెల్దుర్తి మాచర్ల మండలం దుర్గి రెడ్డి చింతల మండలాల నుండి అత్యధిక సంఖ్యలో మహిళలు తమ కుటుంబాల కోసం వస్తూ ఉంటారని వారికి కనీస మరుగుదొడ్లు లేవని వాటి దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరలో పట్టణంలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిలర్లు మొత్తం జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు కౌన్సిలర్లు మదర్ సాహెబ్ రామిరెడ్డి నరసింహారావు సుభాని మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు మున్సిపల్ ఏఈ లు సిబ్బంది పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91126