వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద తీవ్రతరమవుతుంది. గురువారం కుక్క కాటుకు నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. విశ్వబ్రాహ్మణ వీధిలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్ళగా, గాయం తీవ్రంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు..అలాగే మున్సిపల్ సిబ్బంది సునిత, ట్రాఫిక్ సిబ్బందిపై కుక్క దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా, ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి, కుక్కలను నివారించాలని కోరారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 91132