నల్గొండ జిల్లా నార్కాట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నార్కాట్ పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు.. అక్కడికి వెళ్లిన అశోక్ పై.. కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నగదు పంపిణీని తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న అశోక్ పై దాడికి యత్నిస్తూ ఆయన సెల్ ఫోను ధ్వంసం చేశారు. నగదు పంపిణీ వ్యవహారం తనపై దాడికి సంబంధించి.. అశోక్ నార్కాట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సందర్భంలోనూ పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడాన్ని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలని అశోక్ డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.