గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో కలవరం నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజినికి ఇవ్వడంతో గుంటూరు తూర్పు లో మహిళకి సీటు ఇవ్వడం కష్టమేనని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తానే అంటూ ప్రచారంలో దూసుకుపోతుంది ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా. ఫ్లెక్సీలు ఏర్పటు చేసి తానే ఎమ్మెల్యేనంటూ సమావేశాలను నిర్వహించారు. అయితే చివరి నిమిషంలో సీటు మారే అవకాశం ఉండటంతో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా రంగంలోకి దిగాడు. తాడేపల్లిలో సీఎం జగన్ ని ముస్తఫా కలిసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.
Read Also..
Read Also..





Total views : 78340