మార్పు తీసుకొస్తాం వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. యువగళం పాదయాత్ర జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర అని అన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చన్నారు. తనకు రాని అవకాశాన్ని లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందంటూ పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకమన్న పవన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేనన్నారు. భారతదేశానికే స్ఫూర్తినిచ్చిన నేల అని ఐఏఎస్లు, ఐపీఎస్లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లన్నారు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారు. కానీ, ఇప్పుడు.. ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందన్న పవన్ ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదని సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చాన్నారు.
‘యువగళం-నవశకం’ సభలో పవన్ కల్యాణ్
346
previous post






Total views : 78277