హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అరెస్టయిన వ్యక్తి ధూల్పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఇతని మీద గతంలో ధూల్పేట్, మంగళ్హాట్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లలో ఐదు కేసుల్లో ఉన్నాయి. సురేశ్ కోటి వద్ద వైద్య విద్యార్థులకు గంజాయి సాచెట్స్ ను విక్రయించేందుకు యత్నించగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు డాక్టర్ కె మణికందన్, డాక్టర్ వి అరవింద్ లు గంజాయి సాచెట్స్ ను సురేష్ దగ్గర తీసుకోవడం జరిగింది. 2016 నుంచి ఎన్డీపీఎస్లో గంజాయి విక్రయిస్తున్నాడు సురేశ్. వైద్యులు ఇద్దరికీ గంజాయి మూత్ర పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. నిందితుల నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా సురేష్ జుమ్మెరాత్ బజార్కు చెందిన పంకజ్ సింగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నలుగురు వైద్య విద్యార్థులను గుర్తించామని, డ్రగ్స్ సేవించిన ఇతర వైద్య విద్యార్థులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 92367