హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అరెస్టయిన వ్యక్తి ధూల్పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఇతని మీద గతంలో ధూల్పేట్, మంగళ్హాట్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లలో ఐదు కేసుల్లో ఉన్నాయి. సురేశ్ కోటి వద్ద వైద్య విద్యార్థులకు గంజాయి సాచెట్స్ ను విక్రయించేందుకు యత్నించగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు డాక్టర్ కె మణికందన్, డాక్టర్ వి అరవింద్ లు గంజాయి సాచెట్స్ ను సురేష్ దగ్గర తీసుకోవడం జరిగింది. 2016 నుంచి ఎన్డీపీఎస్లో గంజాయి విక్రయిస్తున్నాడు సురేశ్. వైద్యులు ఇద్దరికీ గంజాయి మూత్ర పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. నిందితుల నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా సురేష్ జుమ్మెరాత్ బజార్కు చెందిన పంకజ్ సింగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నలుగురు వైద్య విద్యార్థులను గుర్తించామని, డ్రగ్స్ సేవించిన ఇతర వైద్య విద్యార్థులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్…
- అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు…
- మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్ఆర్ఐ ప్రతినిధులు.మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్ఆర్ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9,…
- మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92161