హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అరెస్టయిన వ్యక్తి ధూల్పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఇతని మీద గతంలో ధూల్పేట్, మంగళ్హాట్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లలో ఐదు కేసుల్లో ఉన్నాయి. సురేశ్ కోటి వద్ద వైద్య విద్యార్థులకు గంజాయి సాచెట్స్ ను విక్రయించేందుకు యత్నించగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు డాక్టర్ కె మణికందన్, డాక్టర్ వి అరవింద్ లు గంజాయి సాచెట్స్ ను సురేష్ దగ్గర తీసుకోవడం జరిగింది. 2016 నుంచి ఎన్డీపీఎస్లో గంజాయి విక్రయిస్తున్నాడు సురేశ్. వైద్యులు ఇద్దరికీ గంజాయి మూత్ర పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. నిందితుల నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా సురేష్ జుమ్మెరాత్ బజార్కు చెందిన పంకజ్ సింగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నలుగురు వైద్య విద్యార్థులను గుర్తించామని, డ్రగ్స్ సేవించిన ఇతర వైద్య విద్యార్థులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223769