చంద్రబాబు దుర్మార్గ క్రీడలకు సచివాలయ సిబ్బంది దొంగలుగా మారుతున్నారు.. విజయవాడ మధురానగర్ 208 సచివాలయం అడ్మిన్ నాగమల్లేశ్వరరావు పెన్షన్ సొమ్ము తీసుకొని పరారయ్యాడు. అవ్వ తాతలు మండుటెండలో సచివాలయం ముందు పడిగాపులు కాస్తుంటే ఊసూర్మనిపిస్తుంది. అడ్మిన్ చెడు వ్యసనాలకు, బెట్టింగులకు బానిసై అవ్వ తాతలకు అందవలసిన పెన్షన్ ను రాబందుల తన్నుకు పోయాడు. సుమారు పెన్షన్ సొమ్ము 4 లక్షల 99 వేల రూపాయలను తీసుకొని పరారైనట్లు తెలుస్తుంది. పెన్షన్ దారులకు అనుమానం రాకుండా సంబంధిత సచివాలయ సిబ్బంది అధికారులతో మాట్లాడి కొంత మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇప్పటికే గుణదల పోలీసుల అదుపులో దొంగగా మారిన అడ్మిన్ నాగమల్లేశ్వరరావు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pension
కపలనత్తం గ్రామంలో రెండు రోజులైనా పెన్షన్ ఇవ్వని వాలంటీర్ హరీష్.. మీడియాకు సమాచారం తెలిసిందని, తెలుసుకున్న అధికారులు పెన్షన్ ను యధావిధిగా అందజేశారు. వాలంటీర్ హరీష్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప మీడియాతో మాట్లాడారు, కపలనత్తం గ్రామంలో వాలంటీర్ హరీష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత రెండు రోజులు అయినా హరీష్ పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వలేదన్నారు. గత రెండు రోజులుగా హరీష్ కు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నారు. ఈ విషయంపై నిన్న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామన్నారు. ఎంపీడీవో ఈ విషయంపై వాలంటీర్ హరీష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. వాలంటీర్ హరీష్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. వాలంటీర్ హరీష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.