పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన పోల హేమంత్ (20)గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తిరుమల రాజు ఉన్నారు వీరి ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
person dead
సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పులిచెర్ల మండలం ఎర్రపాపి రెడ్డి గారి పల్లె సమీపంలో మంగళవారం సాయంకాలం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మస్తాన్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మస్తాన్ పశువుల తోలుకొని పొలాల వద్దకు వెళ్లగా గుంపులుగా వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో గత రెండు నెలలుగా ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తున్న వ్యక్తులపై దాడి చేయడం ఇదే మొదటిసారి.. ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు
అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ ను తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ (60)ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు తీసుకోమని పిలిచి తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపి దుండగులు పరారయ్యారు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు




Total views : 78803