మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండలంలోని జాజుల పేట గ్రామానికి చెందిన పూజిత అనే నిండు గర్భిణికి అర్థరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలో తీవ్రమైన నొప్పులు రావడంతో 108 వాహనాన్ని పక్కకి నిలిపి సిబ్బంది చాక చక్యంగా సుఖ ప్రసవం నిర్వహించారు. ఆ గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది.
pregnant women
మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం వి-హబ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని ఆయన అన్నారు. మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగిందని తెలిపారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చిన్నారిపై 10 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.




Total views : 80191