చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న స్కూల్ బస్సు .ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 197154