నెల్లూరులోని, దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి. యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు. దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు సమాచారం. 100 కి కాల్ చేసిన కుటుంబ సభ్యులు. ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చర్యచేపట్టిన పోలీసులు.
Tag:
robbery
పార్వతీపురం మన్యం జిల్లా, ఎర్రా కృష్ణమూర్తి కాలనీ, సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం. మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ. వై.కె.యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు. 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు. తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..




Total views : 78415