తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పని చేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతరామరాజు, శినారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణగా వ్యవహరించనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం అయిందని, కల్తీ నెయ్యి వినియోగించారని నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పవిత్రంగా ఉండాల్సిన లడ్డూను కల్తీ చేయడంపై శ్రీవారి భక్తులు, హిందువులు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లడ్డూను అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీంతో లడ్డూ వివాదంపై లోతైన విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్లో సభ్యులుగా సిన్సియర్ అధికారులను నియమించింది. దీంతో లడ్డూ వివాదంపై సిట్ అధికారులు వేగంగా విచారణ చేపట్టనున్నారు. గతంలో టీటీడీలో పని చేసిన పలువురిని విచారించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి