Babu Surety – Guarantee for future :
కందుకూరు పట్టణం 3 వ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపరచాలని నాగేశ్వరరావు కోరారు. వార్డులో ప్రధానంగా సైడ్ కాలవలు, రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదేపదే ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని, పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డులో కలియ తిరుగుతూ, చిన్నా పెద్దా అందరిని పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి తమ ఓటు తెలుగుదేశం పార్టీకేనని స్పష్టంగా చెప్పిన మహిళలు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు పువ్వాడి కోటయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 89163