Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Main News కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం…

కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం…

by Prakash
తెలంగాణ, Sabita Indra Reddy

కందుకూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నీళ్ళు, నిధులు, నియామకాలలో, అన్యాయం జరుగుతుందని తెలంగాణా సాధించుకున్నాం, సాధించిన తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవ్సరాలు రాష్ట్ర హక్కులకు బంగం కలిగించకుండా పాలన చేసిన విధానాన్ని గుర్తుంచుకోవాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులు, పోరాట ప్రటిమాతోని కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనా అందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరి కొనమని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఢిల్లీ లో ధర్నా చేశారు. రైతుల వరి ఎందుకు కొనరని కేసిఆర్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తున్న సందర్భంలో కృష్ణా, గోదావరి, రెండూ నదులకు సంబంధించిన నీటి లభ్యతలో ఎక్కడ రాజీ పడకుండా మా రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళ వాట ముఖ్యంగా కృష్ణానది జలాలు పది సంత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ, ఎక్కడ కూడా రాజీ పడకుండా, వాలు ఎంత వత్తిడి చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేశారు. కృష్ణా లో నీళ్ళు రావలనాపుడు తెలంగాణా విడిపోయినప్పుడు మా రాష్ట్ర నికీ కావాల్సిన నీళ్ళ ను కేసీఆర్ ఆ రొజు నుండి ఈ రొజు వరుకు ఏపెక్స్ కమిటీ వేసి కమిటీ అధ్వర్యంలో నీటిని అలాట్ చేయమని అడుగుతున్నారు. కృష్ణా రివర్ బోర్డ్ అప్పగించలన కూడా ఒప్పుకోకుండా, సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది . దాదాపు ఐదు జిల్లాలకు సంబందించిన సమస్య, ఈ జిల్లాలకు సంబందించిన ప్రజలకు ఇబ్బాంది జరగకుండా ఉండడానికి. సుప్రీం కోర్టు వరుకు వెళ్లడం జరిగింది అన్ని అన్నారు. కేంద్ర మంత్రి అధ్వర్యంలో కోర్టు లో విత్ డ్రా చేసుకోవడం జరిగింది. రెండూ రాష్ట్రల వాళ్ళు బోర్డ్ కు అప్పచేపుతే తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ పది సంత్సరాల నుండి కె అర్ ఎంబి అప్పచెప్పకుండ పోరాటం చేస్తున్నా విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మీటింగ్ లోనే కె అర్ఎంబి కి అప్ప చెప్పారు. దాని వలన కృష్ణానది హక్కులను కోల్పోవడం కాకుండా ప్రతి ఒక్కటీ బోర్డ్ పరిధిలోకి వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147103

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.