కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. కార్వేటినగరం మండలం, ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం, కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతోంది. హాస్టల్ గదిలో ఆమె ఉరి వేసుకుని మృతి చెందడంతో సహచరులు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ సమాచారం అందించడంతో వారు ఘటన స్థలము దగ్గర చేరుకునే మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tag:





Total views : 79587