కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఆదివారం విషాదఛాయలు అల్లుకున్నాయి. నూజివీడు త్రిబుల్ ఐటీ లో చదువుతున్న 5 గురు స్టూడెంట్ ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్థానం చేయడానికి దిగిన కొద్దిసేపటికి సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించారు. అదే సమయంలో పెద్ద అలల కింద తోకల అఖిల్ కొట్టుకుపోవడం విషాదాన్ని మిగిల్చింది. మెరైన్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసిన అతని జాడ కనపడలేదు. గల్లంతయిన అఖిల్ కోసం మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Student missing
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) అనే విద్యార్థి లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. మంగలి ఆకాష్ షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నిన్న పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది తల్లిదండ్రులు మృతదేహం గురించి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు మిగతా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్. ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు. నందకిషోర్ మిస్సింగ్ విషయమై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ముందు తల్లిదండ్రులు, బంధువుల నిరసనకు దిగారు.





Total views : 79502